
సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు ఉన్నారు.లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కామారెడ్డి జిల్లా వాసి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ ఉన్నారు.మిగిలిన 39 మంది చత్తీస్ ఘడ్లకు చెందిన వారు డీజీపీ వెల్లడించారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి ఏకంగా 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హైదరాబాద్లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం DGP శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టులు సరెండ్ అయ్యారు.మావోయిస్టులు లొంగిపోవడాన్ని డీజీపీ శివధర్ రెడ్డి స్వాగతించారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 24 ఆయుధాలతో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు.లొంగిపోయిన 41 మందిలో ఇద్దరు తెలంగాణ వారు కాగా...39 మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారు ఉన్నారు అని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన అజ్ఞాత కేడర్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్,కుమురం భీమ్ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు లొంగిపోయిన వారిలో ఉన్నారు.వీరితోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు . వీరిలో11 మంది గెరిల్లా ఆర్మీ బెటాలియన్ చెందిన వారు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. లొంగిపోయిన 41 మందిలో ఇద్దరు తెలంగాణ వారు కాగా.. 39 మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారు ఉన్నారు అని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. మావోలు సరెండర్ చేసిన ఆయుధాలు ఇవే ఇకపోతే మావోయిస్టులు 24 ఆయుధాలతో తమ ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఏకే-47లు 3, ఎల్ఎమ్జీ 1, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు 5, ఇన్సాస్ రైఫిళ్ళు 7, బీజీఎల్ గన్ 1, 303 రైఫిళ్ళు 4, సింగిల్ షాట్ రైఫిల్ 1 , ఎయిర్ గన్స్ 2 మొత్తం 24 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుమేరకు లొంగుబాటు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ప్రాణాలు కాపాడుకోడానికి తెలియని ప్రదేశాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ ఒత్తిడి చేసిందని... ఇలాంటి పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా భావించి మావోలంతా లొంగిపోయినట్లు డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యులకు రూ. 4 లక్షలు, సభ్యులకు రూ.4 లక్షల రివార్డు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయుధాలతో లొంగిపోతే వారికి మరింత నగదును రివార్డ్స్ కింద అందజేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. మెుత్తం 41 మందికి కోటి 47 లక్షల రివార్డ్స్ అందిస్తున్నామని... తక్షణ సహాయం కింద రూ.25 వేలు ఇస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.