ఏపీలో 21న పల్స్ పోలియో

*చిన్నారుల తల్లిదండ్రులు గమనించాలి

ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్… రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో నిర్వహించనున్నట్టుగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్… రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో నిర్వహించనున్నట్టుగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్ల లోపు 54,07,663 మంది పిల్లలు ఉన్నారని… వీరి కోసం 38,267 బూత్‌లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఇందుకోసం 61,26,120 డోస్‌లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించారని తెలిపారు. డిసెంబరు 21 పోలియో దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో పిల్లలకు పోలియో చుక్కల్ని వేస్తారని, ఆ రోజు పలు కారణాలవల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి 76,534 బృందాలు పోలియో చుక్కలు వేస్తాయని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు తగు ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని చెప్పారు. 1704 మెడికల్ అధికారులు, 39,494 ఇతరులు (ఫార్మసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు), 4206 మంది పర్యవేక్షకులు నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్స్ పోలియో ఏర్పాట్లకు సంబంధించి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ టాస్క్ఫోర్స్ సమావేశం జరిగిందన్నారు. జిల్లా, పట్టణ, మండల స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశాలు జరుగుతున్నాయని, ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ లేఖలు రాశారని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *