తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్

★రేపు ఆ రైతుల ఖాతాల్లో రూ.588 కోట్లు జమ... ★అకౌంట్లలో డబ్బులు పడ్డాయా? లేదా? ★ ఎలా చెక్ చేసుకోవాలంటే!

సాక్షి డిజిటల్ న్యూస్: డిసెంబర్ 12న మెుక్కజొన్న రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల ఖాతాలో రూ.588 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 55,904 మంది రైతుల ఖాతాలో నగదు జమ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మెుక్క జొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రేపటి నుండి మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలలో జమచేయనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొత్తం 55,904 మంది రైతులు లబ్ధి పొందనున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేనప్పటికీ...రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వమే పంట సేకరణ చేపట్టిందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న రైతుల నుండి సేకరించబడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సేకరించిన ధాన్యానికి గాను రూ. 588 కోట్లు రేపటి నుండి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కేంద్రం సహకారం లేకున్నా, రైతులను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని, వారికి ఎలాంటి నష్టం కలగకుండా చూడటం తమ మొదటి ప్రాధాన్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయా? లేదా? ఎలా చెక్ చేసుకోవాలంటే... రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 12) రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే... ఆ డబ్బులు 55,904 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి. ఇందుకు సంబంధించి బ్యాంకుల నుంచి అకౌంట్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు మెసేజ్‌లు వస్తాయి. తద్వారా రైతులు వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? లేదా? అని తెలుసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌ లింక్‌కు చేసిన ఫోన్ నంబర్ నుంచి సంబంధిత బ్యాంకు నంబర్లకు కాల్ / మెసేజ్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌లో బ్యాలెన్స్ తనిఖీ చేయడం/ డబ్బులు పడ్డాయా? లేదా? అనేది తెలుసుకోవచ్చు.