సాక్షి డిజిటల్ న్యూస్: భారత ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి భారీ మార్పు చోటుచేసుకోనుంది. భారత ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి భారీ మార్పు చోటుచేసుకోనుంది. దశాబ్దాల నాటి సౌత్ బ్లాక్ ప్రాంగణం నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) బయటకు తరలివెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం ఉండనున్న కొత్త భవనాన్ని ‘సేవా తీర్థ్’ అని పిలువనున్నారు. అయితే ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడానికి ఉద్దేశించబడిన వెస్టా పునరాభిృద్దిలో భాగంగా ఈ కొత్త భవనం నిర్మించారు. తద్వారా పని, సమన్వయం సులభతరం అవుతుంది. వాయు భవన్ పక్కన ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్-Iలో నిర్మించిన మూడు అత్యాధునిక భవనాలలో ఒకటైన సేవా తీర్థం-1లో పీఎంవో కొత్త కార్యాలయం ఉంటుంది. ఇక, పొరుగున ఉన్న భవనాలు, సేవా తీర్థం-2, సేవా తీర్థం-3లలో కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయానికి కొత్త గృహాలుగా పనిచేస్తాయి. ఈ మార్పు ఇప్పటికే జరుగుతుంది. ఎందుకంటే… అక్టోబర్ 14న కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతులతో సేవా తీర్థ్-2 లోపల ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.