జనం న్యూస్: ఏపీ రాష్ట్రానికి దిత్వా తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి కారైకాల్కి 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ తుఫాన్పై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు.తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసి, ప్రభావిత జిల్లాలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు.దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ప్రజలను అలర్ట్ చేయాలి: హోంమంత్రి అనిత తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్లను 24/7 కొనసాగించాలని ఆదేశించారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని ప్రజలు హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. ఏపీకి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ దిత్వా కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అయినటువంటి బాపట్ల, గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 1 తేదీ వరకు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .పెను గాలులు గంటకు 40-50 కీ.మీ గరిష్టముగా 60 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .పెను గాలులు గంటకు 60-70 కీ.మీ గరిష్టముగా 80 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది