
జనం న్యూస్: కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని స్పష్టం చేశారు.కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించా లని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులూ చేసేందుకు వీలులేదని, చట్టపరంగా ఏపీకి దక్కిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రోజున సచివాలయంలో జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీ వాటా కలిగి ఉండగా రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్-1 ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీ చొప్పన జలాలు కేటాయించిందన్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపులను పునఃసమీక్షించాలనడం సరికాదని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ ఏటా వేలాది టీఎంసీ జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రాన్ని కరవు రహితం చేసేలా అన్ని జిల్లాలకు నీటి భద్రత కలిగించేలా. సమర్ధ నీటి నిర్వహణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అలాగే సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వాయర్లలో నెలకొన్న నీటి నిల్వల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 25 నాటికి రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం 1,095 టీఎంసీ వరకు నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు అన్నీ కలిపి సామర్ధ్యంలో 83.43 శాతం మేర నిందాయని తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసినా పలు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండక పోవడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. గ్రావిటీ ద్వారా పూర్తిస్థాయిలో నిండని రిజర్వాయర్లను గుర్తించి. వాటిని లిఫ్ట్ ద్వారా నింపేందుకు చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.గత ఏడాది సగటున 7.45 మీటర్ల లోతున భూగర్భ జలాలుండగా. ఈ ఏడాది 6.8 మీటర్లకు పెరిగిందని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. కోస్తాంధ్రలో 6.77 మీటర్లనుంచి 6.56 మీటర్లకు, రాయలసీమలో 9 నుంచి 7.34 మీటర్లకు భూగర్భజల మట్టాలు పెరిగినట్టు అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే 8 మీటర్లకన్నా దిగువనున్న 5,697 గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున భూగర్భ జలాలు 3 మీటర్లకు తీసుకురావాలనేదే లక్ష్యమని, దీనికి అనుగుణంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 73 శాతం మేర పూర్తికాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. అలాగే ఐట్రన్ డ్యామ్ పనులు పూర్తిచేసినట్టు వివరించారు. వైట్రో కాంపాక్షన్ పనులు 97 శాతం మేర జరిగాయని, వచ్చే నెలాఖరుకు పనులు పూర్తి కానున్నట్టు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులు కొలిక్కి వస్తుండటంతో ప్రాజెక్టులో ప్రధాన భాగమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు వివరించారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, ఆర్ఆర్ ప్యాకేజ్నీ నిర్వాసితులకు వేగంగా అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.