రాజకీయ ప్రవేశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ

* ‘ఐఏఎస్ నియంత్రణకంటే రాజ్యాంగమే ప్రధాన కారణం’”

జనం న్యూస్: ‘పార్లమెంట్, శాసన సభలు చట్టాలు చేస్తాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సభకు రాకూడదు. సమాజ హితం కోసం ప్రజాప్రతినిధులుగా రావాలి. వ్యక్తిగత కక్షల కోసం పోరాడాల్సిన అవసరం లేదు’అని సీఎంచంద్రబాబు నాయుడు హితవు పలికారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తిలకించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో విద్యార్థుల స్కిట్ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినోత్సవం వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికరంగా తిలకించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ‘విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరు చాలా అభినందనీయం. 175 నియోజవకర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని అదరగొట్టారు. చాలా బాగా రాణించారు. అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. విద్యార్థులు తక్కువ సమయంలోనే ఏ విధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్ ఫుల్ గా వ్యవహరించారు. ప్రతి ఒక్కరిలో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. మన కోసం మనం భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లెక్చరర్‌గా చేరమంటే ఎమ్మెల్యేనవుతానని వచ్చేశా. ‘28 ఏళ్లకే నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నాను. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్‌గా చేరాలని అడిగితే…లెక్చరర్‌గా రాను ఎమ్మెల్యే అవుతానని చెప్పాను. 1978లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కనబడతానని చెప్పి గెలిచి చూపించాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినోత్సవం వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికరంగా తిలకించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.‘విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరు చాలా అభినందనీయం. 175 నియోజవకర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని అదరగొట్టారు. చాలా బాగా రాణించారు’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన డైలాగులు, మార్షల్స్ ఎత్తుకెళ్లడం వంటి సీన్లు చూసి సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయవచ్చు. ‘అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. విద్యార్థులు తక్కువ సమయంలోనే ఏ విధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్ ఫుల్ గా వ్యవహరించారు. ప్రతి ఒక్కరిలో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. మన కోసం మనం భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘ఐఏఎస్ అవ్వాలంటే ఎంతో ప్రిపేర్ అవ్వాలి. అదే నేను రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయవచ్చని ఆలోచించాను. నిరంతరం శ్రమ చేయాలి. ప్రతి ఒక్కరికీ సంక్షోభాలు వస్తాయి…వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సరైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలి. అందువల్లే నేను 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 30 ఏళ్లకే నేను మంత్రి అయ్యాను…40 ఏళ్లకు సీఎం అయ్యాను’అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.రాజ్యాంగాన్ని అంబేద్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ‘అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎంపీ అయ్యారు. నా కంటే చిన్న వయసులోనే మీరు మాక్ అసెంబ్లీకి వచ్చి సమర్థవంతంగా నిర్వహించారు. మా ఎమ్మెల్యేలు తడబడ్డా…మీరు మాత్రం తడబడలేదు. మీ కాన్ఫిడెన్స్‌కు అభినందనలు. అసెంబ్లీని మరిపించేలా సెటప్ వేసి మీ అందరినీ ఎమ్మెల్యేలుగా చూస్తున్నాం. బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించుకున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ‘రాజ్యాంగాన్ని అంబేద్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారు. దేశానికి ఆత్మగా భారత రాజ్యాంగం నిలిచింది. 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు సుధీర్ఘంగా చర్చించి రాజ్యాంగాన్ని రూపొంచింది ఆమోదించుకున్నాం. అనేక ఒడిదుడుకులు వచ్చాయి. ఎమర్జెన్సీని కూడా ఎదుర్కొన్నాం. అయినా రాజ్యాంగం మనుగడ సాధించడం వెనక కారణం రాసిన విధానం. రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వారు మంచి వారు కాకపోతే చెడుఫలితాలను ఇస్తుంది. రాజ్యాంగం అమలు చేసే వారు మంచి వారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు’అని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *