జనం న్యూస్: హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శామీర్పేట వద్ద వేగంగా వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ బయటకు రాలేకపోవడంతో సజీవదహనం అయ్యాడు.ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శామీర్పేట నుంచి ఘట్కేసర్ వైపు ఓ కారు ప్రయాణిస్తోంది.ఈ క్రమంలో కారులో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది.దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణలో మెుత్తం వ్యాపించాయి. ఏం జరుగుతుందో గ్రహించేలోపే రెప్పపాటులో కారును మంటలు చుట్టిముట్టాయి. దీంతో డ్రైవర్ బయటకు రాలేకపోయారు. దీంతో కారుతోపాటు డ్రైవర్ పూర్తిగా సజీవ దహనం అయ్యాడు.కేసు నమోదు చేసిన పోలీసులు. కారు దహనం గురించి తెలుసుకున్న పోలీసులు .అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు. మచ్చబొల్లారంలో మరో కారు ప్రమాదం. మరోవైపు సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో కారు బీభత్సం సృష్టించింది. మచ్చబొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి దుకాణాల మీదకు దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆల్వాల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.