సాక్షి డిజిటల్ న్యూస్: దైవం మానుష రూపేణ అన్నట్టుగా సత్యసాయి సేవలందించారు అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన ట్రస్ట్తో సేవలకు రూపం అని అన్నారు. భారతీయుల మూలం వసుధైక కుటుంబం దాన్ని నిలబెట్టుకుందాం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్ల మంది జీవితాలను శ్రీ సత్యసాయి బాబా ప్రభావితం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 86 ఏళ్ల పాటు ఈ పవిత్ర నేలపై తన జీవన ప్రయాణాన్ని సాగించి ఆయన సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించి జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారని తెలిపారు.భగవాన్ శ్రీసత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకుని ఆదివారం పుట్టపర్తిలో శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో కలిసి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ‘1926 నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమిలో ఒకలక్ష్యం కోసం అవతరించారు. 8 ఏళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 14 ఏళ్ల వయసులోనే సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వపు నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. శ్రీ సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి బాబా. సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రశాంతి నిలయానికి 75 ఏళ్లు లవ్ ఆల్, సర్వ్ ఆల్వ్.. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని సత్యసాయి బోధించారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా సిద్ధాంతాలతో నూతన అధ్యాయం ప్రారంభించారని అన్నారు. ‘1960లో బాబా స్థాపించిన సత్యసాయి సంస్థలతో సేవలకు రూపం వచ్చింది. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు. భగవాన్ మనోదర్శనం ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారు. ఎవరూ పిలవకున్నా వారంతట వారే వచ్చి బాబా సిద్ధాంతాన్ని పాటించారు. డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని ప్రశాంతత పుట్టపర్తిలో లభిస్తుందని సీఎం చెప్పారు. సత్యసాయి బాబా లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్. శతజయంతితో పాటు ఈ రోజు మరో విశిష్టత ఉంది. ఈ ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి 75 ఏళ్లు. ఆధ్యాత్మిక సంబరాలకు ఈ నిలయం వేదికైంది. భక్తుల బాధలకు, కష్టాలకు పరిష్కారం చూపే నిలయంగా మారింది. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా… సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరించారు. విద్య నుంచి వైద్యం వరకూ, తాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకూ అందరికీ దక్కేలా చేశారు. దేశ విదేశాల్లో ట్రస్టు ద్వారా సేవలందించారు. 102 సత్యాసాయి పాఠశాలల్లో 60 వేలమంది విద్యార్థులు చదవుకుంటున్నారు.. వారికి ఉచిత విద్య అందిస్తున్నారు.