హసీనా అప్పగింతపై భారత్ నిర్ణయం ఏమిటి?

* షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా భారత్?

జనం న్యూస్ : బంగ్లాదేశ్‌లో మరణశిక్ష పడిన షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణశిక్షపై స్పందించిన భారత్.. ఆమెను అప్పగించాలన్ని విజ్ఞప్తిపై మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే భారత్-బంగ్లాదేశ్ ప్రత్యర్పణ ఒప్పందం 2013లోని నిబంధనలు ఏం చెబుతున్నాయి.. షేక్ హసీనాను బంగ్లాదేశ్ సర్కార్‌కు అప్పగిస్తారా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతుండగా.. షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించినందున.. ఆమెను తమకు అప్పగించాలని.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు షేక్ హసీనా అప్పగింత అంశం భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న హసీనాను వెంటనే తమకు అప్పగించాలని ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వం న్యూఢిల్లీని కోరింది. 2024 జూలైలో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థుల తిరుగుబాటును అణచివేసేందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు గాను.. హెలికాప్టర్లు, డ్రోన్‌లు, మారణాయుధాలను ఉపయోగించి విద్యార్థి నిరసనకారులను చంపడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై షేక్ హసీనాకు ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారం.. శిక్ష పడిన షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్‌లను అప్పగించడం న్యూఢిల్లీకి తప్పనిసరి బాధ్యత అని పేర్కొంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వకం కాని చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. భారత్ స్పందన షేక్ హసీనాకు విధించిన మరణశిక్ష తీర్పుపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తాము తీర్పును గమనించామని తెలిపింది. అయినప్పటికీ.. షేక్ హసీనాను అప్పగించాలనే ఢాకా డిమాండ్‌పై మాత్రం స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *